
క్రమశిక్షణ చాలా ముఖ్యం
● మనం చేసే పనులను బట్టి విలువ పెరుగుతుంది ● జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ/హవేళిఘణాపూర్(మెదక్): మనం చేసే పనులను బట్టి విలువ పెరుగుతుందని, యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పోలీ సు ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని అర్మర్డ్ రిజర్వ్ సిబ్బంది, హోంగార్డు సిబ్బందికి జిల్లా దర్బార్ నిర్వహించారు. అనంతరం మెదక్రూరల్, హవేళిఘణాపూర్ పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్న పొరపాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరు కూడా చెప్పకుండా గైర్హాజరు కావొద్దని సూచించారు.
ప్రతీ శుక్రవారం మీకోసం
ప్రతీ శుక్రవారం సిబ్బంది కోసం కేటాయిస్తానని ఎస్పీ చెప్పారు. క్లిష్ట పరిస్థితులలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు అండగా ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించే దిశగా పని చేయాలని ఎస్పీ శ్రీని వాస్రావు అన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని సూచించారు.