
బస్సులు నడపాలని ఆందోళన
నర్సాపూర్: పాఠశాలలు ప్రారంభమైనా ఆర్టీసీ అధికారులు జక్కపల్లి మార్గంలో బస్సులు నడపడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూడు బస్సులు సరిపోవడం లేదని, గత విద్యా సంవత్సరం మరో బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరగా, నడుపుతామని హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎస్ఐ జగన్నాథం ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఎస్సై డిపో ఇన్చార్జితో చర్చించారు. మంగళవారం నుంచి బస్సులు నడుపుతామని తెలిపారు. రాస్తారోకోతో హైదరాబాద్, మెదక్ మార్గంలో రోడ్డుపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.