
రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం
పాపన్నపేట(మెదక్): రైతు సంక్షేమమే ఊపిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మండలంలోని పొడిచన్పల్లి రైతు వేదికలో సీఎం రేవంత్రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో 57 రైతు వేదికల్లో సుస్థిర వ్యవసాయంపై సలహాలు అందిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో రైతు వేదికల్లో వీడియో కాన్పరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద 2.26 లక్షల మందికి రూ.140 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలిన 35 వేల మంది రైతులకు రాబోయే 9 రోజుల్లో జమ చేస్తామన్నారు. అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్ వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ వినయ్, ఉద్యావన అధికారి ప్రతాప్సింగ్, ఏఓ నాగమాధురి, ప్రభాకర్రెడ్డి, శ్రీకాంత్, గోవింద్, రైతులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే
మైనంపల్లి రోహిత్