
సామాజిక భద్రత కార్మికుల హక్కు
మెదక్ కలెక్టరేట్: సామాజిక భద్రత కార్మికుల హక్కు అని, రోజుకు రూ. 178తో కూలీలు బతికేదెట్లా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల లాభాల కోసం కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులపై పాలకులు దాడి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్తో 74 శాతం మందికి ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూలై 9న దేశవ్యాప్త చేపట్టనున్నట్లు తెలిపారు. సమ్మెలో కార్మికులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, మహేందర్రెడ్డి, సహాయ కార్యదర్శులు నాగేందర్ రెడ్డి, సంతోష్, ఆసిఫ్, కోశాధికారి నర్సమ్మ పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు