మంచిర్యాలఅగ్రికల్చర్: ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు సంఘీభావం తెలిపా రు. ఆర్టిజన్స్ చేపట్టిన సమ్మె మంగళవారం ఏడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఈశ్వర్రావు, జేఏసీ నాయకులు మాట్లాడారు. కా ర్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల ని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. 541 జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు శివ, సాయి, శ్రీకాంత్, పవన్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.


