మంచిర్యాలరూరల్(హాజీపూర్): కాంగ్రెస్ ప్ర భుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన బీసీ అంశాలను నెరవేర్చాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లాలో లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బుధవారం మల్కల్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్ము ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు గజ్జెల్లి వెంకట య్య, నాయకులు శాఖపూరి భీంసేన్, వేముల అశోక్, కీర్తి రవి, శ్రీనివాస్, రామగిరి రాజన్నచారి, ధర్మాజీ సాయి పాల్గొన్నారు.


