
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వీరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 15న జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన బోయ శ్రీనివాసులు నారాయణపేట్కు బదిలీకాగా ఆయన స్థానంలో సికింద్రాబాద్లోని సిటీ సివిల్ కోర్ట్లో పని చేసిన వీరయ్యను నియమిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించారు.
జిల్లా జడ్జిని కలిసిన డీసీపీ
మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఏ. వీరయ్యను బుధవారం డీసీపీ ఎగ్గడి భాస్కర్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో జరుగుతున్న నేరాలపై సమీక్షించారు.