జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ

Apr 24 2025 12:21 AM | Updated on Apr 24 2025 12:21 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ

మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వీరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 15న జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన బోయ శ్రీనివాసులు నారాయణపేట్‌కు బదిలీకాగా ఆయన స్థానంలో సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్ట్‌లో పని చేసిన వీరయ్యను నియమిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండవరం జగన్‌, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించారు.

జిల్లా జడ్జిని కలిసిన డీసీపీ

మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఏ. వీరయ్యను బుధవారం డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో జరుగుతున్న నేరాలపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement