రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Apr 20 2025 1:56 AM | Updated on Apr 20 2025 1:56 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

● ఇద్దరికి తీవ్రగాయాలు

తానూరు/భైంసాటౌన్‌: తానూరు మండలంలోని భోసి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాంద గ్రామానికి చెందిన చందు (50), హన్మంతు, బాబన్న(సుదర్శన్‌) భైంసా వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భోసి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చందు తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. హన్మంతు, బాబన్నకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. హన్మంతు పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్‌కు తరలించగా, బాబన్న భైంసా ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రోడ్డు ప్రమాదంలో  ఒకరి దుర్మరణం
1
1/1

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement