సిబ్బంది సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సమయపాలన పాటించాలి

Jul 25 2025 8:03 AM | Updated on Jul 25 2025 8:07 AM

సిబ్బంది సమయపాలన పాటించాలి

సిబ్బంది సమయపాలన పాటించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది అందరినీ సమానంగా చూస్తామని.. ఏ ఒక్కరి మీద ఎలాంటి చర్యలు తీసుకోమని వీసీ శ్రీనివాస్‌ అన్నారు. ‘సాక్షి’లో బుధవారం ‘పీయూలో ఏం జరుగుతోంది’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వీసీ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ సమయాల్లో తప్పకుండా విధుల్లో ఉండాలని సిబ్బందికి ఇప్పటికే సూచించామని, ఆ ఆదేశాలకు అనుగుణంగా అంరూ పనిచేసి, అభివృద్ధి చెందుతున్న యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అంతేకాకుండా సిబ్బంది వేతనాలు పెంచేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని, తప్పకుండా నాన్‌టీచింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతామని పేర్కొన్నారు.

‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement