
వేగవంతంగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్/ ధరూరు/ దోమలపెంట/ ఎర్రవల్లి: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.
ఎత్తిపోతలకు నీటి విడుదల
జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో ఇన్ఫ్లో వరద మరింత పెరిగింది. దీంతో భీమా లిఫ్టు–1 650 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు వదలగా.. మ రో 65 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.682 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలానికి 92,789 క్యూసెక్కులు
జూరాలలో శుక్రవారం ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 31,852 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 58,722, సుంకేసుల నుంచి 2,215 కలిపి మొత్తం 92,789 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 849.5 అడుగుల వద్ద 78.9240 టీఎంసీల నీటి నిల్వ ఉంది.