గోడౌన్ల నిర్వహణపైఅలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

గోడౌన్ల నిర్వహణపైఅలసత్వం వద్దు

Jun 21 2025 3:03 AM | Updated on Jun 21 2025 3:03 AM

గోడౌన్ల నిర్వహణపైఅలసత్వం వద్దు

గోడౌన్ల నిర్వహణపైఅలసత్వం వద్దు

జడ్చర్ల టౌన్‌: గోడౌన్ల నిర్వహణపై అలసత్వం ప్రదరర్శించినా.. అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన జడ్చర్ల మండలంలోని బూరెడ్డిపల్లి సమీపంలో ఉన్న గిడ్డంగుల సంస్థకు చెందిన గోడౌన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ చేస్తున్న కందులను, స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. రిజిస్టర్‌లోని నిల్వలకు, భౌతిక నిల్వలకు ప్రతిరోజు లెక్కలు సరిచేసుకోవాలని సూచించారు. తనిఖీకి వచ్చిన ఆయనకు హమాలీలు తమ సమస్యలను విన్నవించగా.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ జిల్లా జనరల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ శ్రీనివాస్‌, డీఈ రాజు, వేర్‌హౌజ్‌ మేనేజర్‌ నర్సింహులు, గోడౌన్‌ ఇన్‌చార్జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement