పాలమూరులో ఉత్సాహంగా ఒలింపిక్‌ డే రన్‌ | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో ఉత్సాహంగా ఒలింపిక్‌ డే రన్‌

Jun 21 2025 3:03 AM | Updated on Jun 21 2025 3:03 AM

పాలమూరులో ఉత్సాహంగా ఒలింపిక్‌ డే రన్‌

పాలమూరులో ఉత్సాహంగా ఒలింపిక్‌ డే రన్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఒలింపిక్‌ డే రన్‌ ఉత్సాహంగా సాగింది. స్థానిక మెయిన్‌ స్టేడియం నుంచి ప్రారంభమైన ఒలింపిక్‌ డే రన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా అంబేడ్కర్‌ చౌరస్తా వరకు తిరిగి అక్కడి నుంచి స్టేడియం వరకు నిర్వహించారు. ముందుగా ఒలింపిక్‌డే రన్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి.. క్రీడాజ్యోతితో ఒలింపిక్‌ రన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచడానికి జిల్లాలోని క్రీడాభిమానులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని క్రీడా కార్యక్రమాలు ఎలా పెంపొందించాలనే దానిపై నివేదిక ఇస్తే కచ్చితంగా వాటికి సంబంధించిన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 2036 వరకు మన రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ కార్యక్రమంలో క్రీడలను భాగస్వామ్యం చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. పాలమూరు చదువుతోపాటు క్రీడల్లో తెలంగాణలోనే అగ్రస్థానంలో ఉండాలన్నారు. థాయిలాండ్‌లో జరిగిన సాఫ్ట్‌బాల్‌ ఏషియా కప్‌లో పాల్గొన్న కిరణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌, రాష్ట్ర రోయింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మిథున్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌పీ.వెంకటేశ్‌, కురుమూర్తిగౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు విలియం, దామోదర్‌రెడ్డి, చెన్న వీరయ్య, రామచందర్‌, సురేష్‌చందర్‌, జియావుద్దీన్‌, రాములు, బాలరాజు, జగన్‌మోహన్‌గౌడ్‌, భానుకిరణ్‌, నాగరాజు, రాఘవేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement