పర్యావరణ పరిరక్షణే లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం!

Jun 18 2025 7:26 AM | Updated on Jun 18 2025 7:26 AM

పర్యా

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం!

మహబూబాబాద్‌ అర్బన్‌: మానవ మనుగడకు చెట్లే ఆధారం. సకల జీవరాశులు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెట్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈమేరకు పచ్చదనం పెంపులో భాగంగా మొక్కల ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతీ పాఠశాలలో చురుకై న విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేకంగా పర్యావరణ క్లబ్‌లు ఏర్పాటు చేస్తోంది.

ఈ ఏడాది నుంచి పేరుమార్పు..

పచ్చదనం పెంపు, మొక్కల రక్షణపై అవగాహన, పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణ లో విద్యార్థులను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో పర్యావరణ క్లబ్‌ (ఎకో క్లబ్‌)లను ఏర్పాటు చేయగా..ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్‌ ఫర్‌ మి షన్‌ లైఫ్‌’గా పేరు మార్పు చేశారు. అన్ని పాఠశాలల్లో కొత్త క్లబ్‌ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులతో కమిటీ..

ఈ నెల 17 నుంచి జూలై 29వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో క్లబ్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి క్లబ్‌లో భాగస్వాములను చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కమిటీలు ప్రతీరోజు ఏడు థీమ్‌లకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు https://merilife.nic.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కాగా జిల్లాలోని 922 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ప్రచార అంశాలు..

ఎకో క్లబ్‌లు శక్తి, నీటిని ఆదా చేయడం, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు నో చెప్పడం, స్థిరమైన ఆహార వ్యవస్థలు ఉపయోగించడం, వ్యర్థాలు తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోడం, ఈ వ్యర్థాలను తగ్గించడం వంటి అంశాలను ప్రచారం చేయనున్నారు.

అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్లబ్‌ల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా అన్ని పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. కేటాయించిన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగించాలి. ప్రతీరోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

– చంద్రశేఖర్‌ ఆజాద్‌, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలు

ఉన్నత పాఠశాలలు 102

ప్రాథమికోన్నత 120

ప్రాథమిక 676

కేజీబీవీలు 16

మోడల్‌ స్కూళ్లు 8

గతంలో పాఠశాలల్లో పర్యావరణ క్లబ్‌ల ఏర్పాటు

ఈ ఏడాది నుంచి

‘ఎకో క్లబ్‌ ఫర్‌ మిషన్‌ లైఫ్‌’గా పేరుమార్పు

విద్యార్థులతో కమిటీల

ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం!1
1/1

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement