శిథిలావస్థలో పశువైద్యశాల | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో పశువైద్యశాల

Jun 18 2025 7:26 AM | Updated on Jun 18 2025 7:26 AM

శిథిలావస్థలో పశువైద్యశాల

శిథిలావస్థలో పశువైద్యశాల

కొత్తగూడ: మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. 40ఏళ్ల క్రితం నిర్మించి భవనం గోడలు, స్లాబ్‌ దెబ్బతిని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యం కోసం పశువులను తీసుకొచ్చే రైతులు సైతం వైద్యశాల వద్ద కూర్చోవడానికి భయపడుతున్నారు.

నిత్యం పశువులకు వైద్యం..

పశు వైద్యశాల పరిధిలో కొత్తగూడ, గుంజేడు, వేలుబెల్లి, గోపాలపురం, కార్లాయి, బత్తులపల్లి, తాటివారివేంపల్లి, పెగడపల్లి, నీలంపల్లి, ఎదుళ్లపల్లి, జంగవానిగూడెం, రామన్నగూడెం, ముస్మి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నిత్యం రైతులు వైద్యశాలలో పశువులకు చికిత్స చేయిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పశువైద్యశాల నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే గడ్డి విత్తనాలు, మందులు వర్షాల సమయంలో తడిసి పనికి రాకుండాపోతున్నాయి. దీంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

భయం భయంగా సిబ్బంది విధులు

ఇబ్బందిపడుతున్న పశు పోషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement