
ప్రొసీడింగ్ పత్రాలు అందజేయాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కా ర్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇళ్ల పనులు ప్రారంభించాలన్నారు. వేగవంతంగా ని ర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, హౌసింగ్ డీఈ రాజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో