
తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
ఖిలా వరంగల్: తీర్థ యాత్రలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 23 నుంచి జూలై 01వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జూయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్యాకేజీ –1 (గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర–ఎస్సీజెడ్ బీజీ 44) యాత్రలో కాశీ (వారణాసి), అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ రాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించొచ్చు. ఈయాత్ర జూన్ 23వ తేదీన ప్రారంభమై జూలై 01వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.16,200, థర్డ్ ఏసీ ధర రూ. 26,500, 2 ఏసీ ధర రూ. 35,000 ఉంటుంది. యాత్ర రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూ బాబాద్, డోర్నకల్, ఖమ్మం మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, ప లాస, బరంపూర్, భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది. ప్రయాణికులకు రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భో జనం, రాత్రి భోజనం), వాటర్ బాటిళ్లు, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శించొచ్చు. అదనపు ఖర్చులు ఏమి ఉండవు. ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయి.అలాగే, రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు ప్రయాణం పూర్తిగా ఉచితం. టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు వివరాలకు 9701360701 నంబర్లో సంప్రదించాలని కోరారు.
బైక్ను ఢీకొన్న బొలెరో
● మహిళ మృతి, ఇద్దరికి గాయాలు
● పాలకుర్తిలో ఘటన
పాలకుర్తి టౌన్: బైక్(టీవీ ఎక్సెల్)ను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై పవన్కుమార్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన పండుగ చైతన్య(36) తనకున్న భూమిలో వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం మామ సోమయ్య, కూతురు ప్రవళికతో కలిసి బైక్పై పాలకుర్తి మండల కేంద్రానికి వస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి బొలెరో ఢీకొనడంతో చైతన్య అక్కడికక్కడే మృతి చెందింది. సోమయ్య, ప్రవళికకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ తరలించినట్లు ఎస్సై పవన్కుమార్ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, 2005లో చైతన్య భర్త కుమార్ ట్రాక్టర్ యాక్సిడెంట్లో మృతి చెందాడు.

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు