
ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంనిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూనియర్ కళాశాల, పాఠశాలల హద్దులు గుర్తించాలన్నారు. ఈ ఏడాది పదో వతరగతి ఫలితాల్లో మానుకోట జిల్లాను మొదటిస్థానంలో నిలిపారని, అదే ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మినరల్ వాటర్ మధ్యాహ్న భోజన సమయంలో అందుబాటులో ఉంచాలన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖలీల్పాషా, శ్యామ్, సురేష్, టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, కళాశాల, పాఠశాలల ప్రిన్సిపాళ్లు పొక్కుల సదానందం, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్