
ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఇందిరమ్మ ఇళ్లు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సీజనల్వ్యాధులు, శానిటేషన్పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేన్, గ్రౌండింగ్, ప్రొసీడింగ్ కాపీల మంజూరు 90శాతం పూర్తియిందన్నారు. దశల వారీగా ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. ఈనెల 30వరకు జిల్లాలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు,. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఆర్డీఓ మధుసూదన్, డీఈఓ రవీందర్రెడ్డి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నర్సింహాస్వామి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఏఓ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్