
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సంరద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని యెల కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రజావాణిలో 97వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు మధుసూదన్రాజ్, హరిప్రసాద్, మరియన్న, నరసింహాస్వామి, సురేష్, శ్రీనివాస్, రజిత, సత్యనారాయణ, రవీందర్రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని..
● మానుకోట పట్టణానికి చెందిన ఏలేంద్ర, గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామానికి చెందిన జ్యోతి తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయా లని ప్రజావాణిలో దరఖాస్తులు అందించారు.
● నెల్లికుదురు మండలం నర్సింహులడూడెం గ్రామానికి చెందిన రైతులు గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు గుండ్లపది చెరువు తూము తెగి తమ పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయని, తూము నిర్మాణం చేపట్టాలని ప్రజావాణిలో వినతి అందజేశారు.
● అమనగల్ గ్రామ శివారు గుండాలగడ్డతండాలో తాగునీటి కోసం చేతిపంపు, డ్రెయినేజీ ఏర్పాటు చేశామని, అయితే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పలువురు గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్