
కాళోజీ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా కేశవ్
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా డాక్టర్ కేశవ్ నియమితులయ్యారు. నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి, నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆర్థో విభాగం అసో సియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేశవ్, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల ప్రొఫెసర్ డి.నాగలక్ష్మి, హైదరాబాద్ ఆర్హెచ్ఎఫ్ డబ్ల్యూటీసీ కార్యాలయ పర్యవేక్షకుడు ఎండి. ఫయాజ్, మహబూబాబాద్ ప్రభుత్వ న ర్సింగ్ కళాశాల పరిపాలన అధికారి బి.శ్రీనివాస్ను డిప్యుటేషన్పై కాళోజీ నారాయ ణరావు హెల్త్ యూనివర్సిటీకి కేటాయించారు. ఏడాది కాలం పాటు హెల్త్ యూనివర్సిటీలో విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.