
వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకొని దోచుకున్నారు..
మహబూబాబాద్ అర్బన్: దేశంలో వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకొని కొంత మంది నాయకులు దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. జిల్లా కేంద్రంలోనీ బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వక్ఫ్బోర్డు సరవణ చట్టం ప్రయోజనాల గురించి వివరించడానికి బీజేపీ దేశావ్యాప్తంగా వక్ఫ్ సుధార్ జనజాగరన్ అభ్యాస్ ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. మే 5వరకు ప్రచారం కొనసాగుతుందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ప్రతి పేద ముస్లింకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింల ఇంటింటికీ వెళ్లి చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు ముస్లిం ఓట్లు మాత్రమే అవసరమా.. మిగిలిన వారి ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వక్ఫ్బోర్డు ఆదాయం ఎక్కడికి పోతుందనే విషయాన్ని అసదుద్దీన్, అక్బరుద్దీన్, కాంగ్రెస్ పాలకులు చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్సుందర్ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రరావు, జిల్లా నాయకలు రాంబాబు, వెంకన్న, ఇందుభారతి, సందీప్, సత్యనారాయణ, ముస్తఫా, వక్ఫ్ సంస్కరణల కోకన్వీరన్ తుంపిళ్ల శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు.