
ధరణి పోర్టల్ సీతానగరం రైతులకు శాపం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సీతానగరంతో పాటు సమీప గ్రామాల రైతులకు శాపంగా మారింది. ఇప్పటి మా సాగు భూములను 1954–1970 మధ్యలో మా తాత, ముత్తాతలు ఇక్కడి ఒక ముస్లిం వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. తెలంగాణ రాక ముందు వరకు మా భూములు రెవెన్యూలో మా పేర్లపై ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఏర్పడిన ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో మా పేర్లు మాయమయ్యాయి. ఈ సమస్యపై ఎన్నో ఏళ్లుగా ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నాం. మా పేర్లపై ఉన్న కాగితాలు ఉన్నాయి. మా సమస్యకు వెంటనే పరిష్కార మార్గం చూపాలి. – ఆకుల రమేశ్, రైతు, సీతానగరం