
అమెరికాతో ఒప్పందాలు విరమించుకోవాలి
తొర్రూరు: అమెరికాతో భారత్ ఒప్పందాలు విరమించుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు పేర్కొన్నారు. భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ రాకను నిరసిస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో నిరసన తెలిపారు. అమెరికాకు లాభం చేకూర్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు ముంజంపల్లి వీరన్న, ఎండీ యాకూబ్, ఆలకుంట్ల సాయిలు, ఊడుగుల లింగన్న, జమ్ముల శ్రీను, యాకాంతం, వల్లపు సాయిలు పాల్గొన్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటనను
నిరసిస్తూ ఆందోళన
బయ్యారం: అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత పర్యటనను నిరసిస్తూ సోమవారం మండలకేంద్రంలో వామపక్ష ప్రజా, రైతుసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో వ్యవసాయరంగంను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే అమెరికా ఉపప్రధాని పర్యటనను భారతదేశంలో నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మండ రాజన్న, బిల్లకంటి సూర్యం, భిక్షం, పాల్గొన్నారు.