
క్రీడలతో మానసికోల్లాసం
తొర్రూరు: క్రీడలతో ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. అనుమాండ్ల మాధవరెడ్డి స్మారకార్థం వాలీబాల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జట్లు పాల్గొనగా రఘునాథపల్లి జట్టు ప్రథమ స్థానంలో, మేడారం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గొడిశాల నగేష్, ఎంఈఓ బుచ్చయ్య, ప్రతినిధులు వాసిరెడ్డి ప్రవీణ్రెడ్డి, సూరం ఉపేందర్రెడ్డి, కొండం జనార్ధన్, హెచ్ఎం లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.