
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
కొత్తగూడ/గంగారం: ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కా రం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అ న్నారు. సోమవారం కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ధరణి వల్ల భూరికార్డులు లేకుండా పోయాయని అన్నారు. మళ్లీ ప్రతీ భూమికి భూ భారతి ద్వారా రికార్డులు వస్తాయని అన్నారు. ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి భూమిపై ఎవరు సాగులో ఉన్నారు, ఎన్ని ఏళ్లుగా ఉన్నారు, హద్దులు, ఏమైనా సివిల్ తగాదాలు ఉన్నాయా లేదా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తయారు చేస్తారని చెప్పారు. రికార్డులు లేకుండా పోయిన పట్టా భూములకు పరిష్కారంతో పాటు మోఖా మీద ఎవరు ఉన్నారని తేలిపోతుందన్నారు. దీంతో రైతులకు సకాలంలో న్యాయం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు రమాదేవి, సత్యనారాయణ, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, అప్పరావు పాల్గొన్నారు.
పహాణీల ద్వారా పంట రుణాలు ఇవ్వాలి:
చల్ల నారాయణరెడ్డి, రైతు
షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమికి పహాణీలు జారీ చేసి పంట రుణాలు ఇవ్వాలని రైతు చల్ల నారాయణరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో 1/70కి లోబడి ఉన్న భూములకు పహాణీల ద్వారా రుణాలు వచ్చాయని చెప్పాడు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి సమాధానం ఇస్తూ పట్టాలతో సంబంధం లేకుండా పహాణీల ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని భూ భారతిలో ప్రత్యేక నిబంధన ఉన్నట్లు తెలిపారు.
ధరణిలో రద్దయిన పట్టాలను
పునరుద్ధరించాలి: బిట్ల శ్రీనివాస్, రైతు
ధరణి చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో రద్దయిన పట్టాలను పునరుద్ధరించాలని రైతు బిట్ల శ్రీనివాస్ కలెక్టర్ను కోరాడు. ఈవిషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశాడు. కలెక్టర్ సమాధానం ఇస్తూ ఫారెస్ట్ శాఖను అనుసంధానం చేసుకుని సమస్య పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్

‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం

‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం