కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కాన్పుల వార్డులో పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో మంచంపై ఇద్దరు గర్భిణులను పడుకోబెట్టి చికిత్స అందిస్తుండటంతో కాన్పు కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలింతలు చంటి బిడ్డలతో ఒకే మంచంపై నరకయాతన అనుభవిస్తున్నారు. బాలింతలకు సహాయకులుగా వచ్చిన వారు చంటి పిల్లలను ఎత్తుకుని లాలిస్తున్నారు. పెద్దాసుపత్రిపై నమ్మకంతో ఎంతో దూరం నుంచి ప్రసవం కోసం వస్తే కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


