
నిర్లక్ష్యం వీడని విద్యుత్ శాఖ
● నెలలో 10–15 వరకు ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి.
● ప్రమాదాలు సాంకేతిక లోపం వల్ల జరగడం లేదని.. రైతులు, ఇతరుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడుతున్నారని దాటవేత ధోరణి అవలంబిస్తోంది.
● ఇళ్ల మధ్య, వీధుల్లో.. పొలాల్లో చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
● అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు చెబుతున్నా ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం.
● పలు ప్రాంతాల్లో వేర్వేరు ఫీడర్ల నుంచి వచ్చే లైన్లు ఒకే స్తంభంపై ఉంటున్నాయి.
● ఇలాంటి చోట్ల మరమ్మతుల నిర్వహణకు ఒక ఫీడర్ నుంచి వచ్చే లైన్లో సరఫరా నిలిపివేసినా.. రెండో లైన్లో సరఫరా అయ్యే విద్యుత్ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.