ఈ ఏడాది 150 ఎకరాల్లో మల్బరీ సాగు | - | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 150 ఎకరాల్లో మల్బరీ సాగు

Jun 19 2025 4:04 AM | Updated on Jun 19 2025 4:04 AM

ఈ ఏడాది 150 ఎకరాల్లో మల్బరీ సాగు

ఈ ఏడాది 150 ఎకరాల్లో మల్బరీ సాగు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో ఈ ఏడాది 150 ఎకరాల్లో మల్చరీ సాగు చేపట్టి 1,053 మెట్రిక్‌ టన్నుల పట్టుగూళ్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మల్బరీ ప్లాంటేషన్‌కు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఎకరాకు రూ.85 వేల సబ్సిడీ లభిస్తుందన్నారు. షెడ్లకు యూనిట్‌ కాస్ట్‌ రూ.4.50 లక్షలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.4.05 లక్షలు, ఇతరులకు రూ.3,37,500 సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. పరికరాలకు యూనిట్‌ కాస్ట్‌ రూ.75 వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.67500, ఇతరులకు రూ.56250 సబ్సిడీ వర్తిస్తుందన్నారు. జిల్లాలో నీటి వసతి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శ్రీశైలం డ్యాం నీటిమట్టం 845.10 అడుగులు

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం డ్యాం నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 845.10 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 70.3596 టిఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 33,876 క్యూసెక్కుల వరదనీరు జలాశయానికి వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ నాగార్జునసాగర్‌కు విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం 7,701 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్‌వాటర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 0.088 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 3.441 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement