
ఐదుగురికి కారుణ్య నియామకాలు
కర్నూలు(అగ్రికల్చర్): కారుణ్య నియామకాల్లో భాగంగా ఐదుగురికి జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుబ సభ్యులకు ఇటీవల కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో భాగంగా జిల్లా ట్రెజరీకి కేటాయించిన సరితారాణి, షెన్వాజ్, ప్రభావతి, శ్వేతప్రియ, గంగాధర్లకు పోస్టింగ్ ఉత్తర్వులను అందచేశారు. వీరిని జూనియర్ అకౌంటెంట్లుగా నియమించారు. గంగాధర్ను నంద్యాల జిల్లా ట్రెజరీకి కేటాయించగా.. మిగిలిన నలుగురికి కర్నూలు జిల్లా ట్రెజరీలోనే జూనియర్ అకౌంటెంట్లుగా నియమించారు. కార్యక్రమంలో ఎస్టీవో కరుణాకర్ కూడా పాల్గొన్నారు.
బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కర్నూలు (హాస్పిటల్): బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పెరుగు విజయవర్దన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ కంట్రెన్స్ టెస్ట్ (ఏపీఎన్సీఈటీ–2025) పరీక్షలో తప్పక పాల్గొనాలన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు https:// apuhs& ncet& aptonline. in/ NCET/ Homeలో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08518–229134, 9490526342ను సంప్ర దించాలన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
ఆలూరు రూరల్: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. కరిగుడ్డం గ్రామం వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడి చేయగా ఆదోనికి చెందిన బొలెరో వాహనం డ్రైవర్ షేక్షావలిని అదుపులో తీసుకోగా.. క్లీనర్ ఇంగప్ప పరారయ్యాడు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని, 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రైస్ను రెవెన్యూ అధికారులకు అప్పగించి స్థానిక సివిల్ సప్లయ్ గోదాములో భద్రపరిచామని ఎస్ఐ వెల్లడించారు.
శ్రీశైలంలో 68.5 టీఎంసీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 68.5660 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 844.20 అడుగులకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఎగువ జూరాల, తుంగభద్రల నుంచి 39,088 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి నాగార్జునసాగర్కు 8,714 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,326 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.990 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు.