
ఇండియన్ ఆర్మీలో చేరండి
నంద్యాల(న్యూటౌన్): ఆసక్తి గల యువకులు ఇండియన్ ఆర్మీలో చేరాలని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు డైరెక్టర్ కల్నల్ రజిత సువర్ణ అన్నారు. ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాలలో ఆదివారం 9వ ఆంధ్ర గర్స్ల్ బెటాలియన్ శిక్షణ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ క్యాంపు కమాండెంట్ కల్నల్ ప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు డైరెక్టర్ హాజరై మాట్లాడారు. అగ్నిపత్ ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్సీసీ కేడెట్స్, ఎన్సీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
కర్నూలు(సెంట్రల్): రెండు నెలల నుంచి 104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలేదని, వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏవీనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కర్నూలులోని కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేవారని, ప్రస్తుతం చెల్లించడం లేదన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు,, ఉపాధ్యక్షుడు వెంకటేష్,కల్యాణి, సీనియర్ నాయకులు బొజ్జప్ప పాల్గొన్నారు.
చెట్నెహళ్లి ఘటనలో
29 మందిపై కేసు
మంత్రాలయం: మండలంలోని చెట్నెహళ్లి గ్రామంలో శ్మశాన వాటికకు కంచె ఏర్పాటు చేస్తుండగా వివాదం జరగ్గా.. నలుగురు మహిళలతోపాటు 25 మంది పురుషులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్మశాన వాటికలోని 0.47 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునేందుకు శనివారం కంచె ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇళ్ల వైపు 20 అడుగుల దూరం వదిలి కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకోగా కొందరు ఒప్పుకోలేదు. అధికారుల విధులకు ఆటంకం కల్గించారన్న నేపథ్యంలో జేసీ నవ్య సూచన మేరకు వీఆర్వో భీమయ్య మంత్రాలయం పోలీస్ స్టేషన్ల్ ఫిర్యాదు చేశారు. కంచె కోసం పాతిన పిల్లర్లను తొలగించడమే కాకుండా విధులకు ఆటంకం కల్గించారని 29 మందిపై ఫిర్యాదు చేశారు. అందులో నలుగురు మహిళలతోపాటు 25 మంది పురుషులపై కేసు నమోదు అయ్యింది. ఎస్ఐ శివాంజల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇండియన్ ఆర్మీలో చేరండి