
పాఠశాల అభివృద్ధికి కృషి
నందికొట్కూరు: తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని పూర్వ విద్యార్థి, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్బాషా స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో మాట్లాడి ఆయన పట్టణంలోని సుబ్బారావుపేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (కొట్టంబడి)అభివృద్ధి కోసం డిస్ట్రిక్ జనరల్ ఫండ్ నుంచి రూ. 13 లక్షలు విడుదల చేయించారు. ఆ నిధులతో చేపట్టనున్న స్కూల్ మరమ్మతు పనులను ఆదివారం ఎమ్మెల్యే జయసూర్యతో కలిసి కర్నూలు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ పాఠశాలలో చదివి ఉన్నతస్థాయికి చేరుకున్న ప్రతి ఒక్కరూ పాఠశాల డెవలప్మెంట్ కోసం సహాయ సహకారాలు అందించాలన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో రూప్ సీలింగ్, మినరల్ వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, శ్లాబ్ మరమ్మతులు తదితర వాటికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్రెడ్డి, కమిషనర్ బేబి, మార్కెట్ యార్డు చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి, పీఆర్ ఈఈ రఘురామిరెడ్డి, డీఈలు ధనిబాబు, రామ్మోహన్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఏఈ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు సుమలత, చాంద్బాషా, లాలు, జాకీర్, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.