
విధుల్లో అలసత్వం తగదు
ఆలూరు: విధి నిర్వహణలో వైద్య సిబ్బంది అలసత్వం వహించడం తగదని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక సీహెచ్సీ కేంద్రాన్ని (ప్రజా ఆరోగ్య కమ్యూనిటీ అర్బన్ హెల్త్ కేంద్రాన్ని) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ శాతం పేదలు ఉంటారని, వారిని నిర్లక్ష్యం చేయడం మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కోట్లాది రూపాయలతో ఆధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, వాటిని సద్వినియోగం చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో సివిల్సర్జన్ డాక్టర్ వాహిద్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, రామకృష్ణ, స్టాఫ్ నర్సులు నిర్మల, మంగమ్మ, రాజేశ్వరి, భారతి, ఎన్టీర్ ఆరోగ్య మిత్రలు కృష్ణారెడ్డి, మంజునాథ్ తదితరులు ఉన్నారు.