టీడీపీ జెండాను మోయలేను | - | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండాను మోయలేను

Jan 9 2024 2:26 AM | Updated on Jan 9 2024 8:43 AM

మాట్లాడుతున్న టీడీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి  - Sakshi

మాట్లాడుతున్న టీడీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి

ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపు రాజకీయాల కారణంగా నలిగిపోతున్నానని, ఇక ఆ పార్టీ జెండా మోయలేనని టీడీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సీఎస్‌.నారాయణరెడ్డి సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుతం ఆలూరు టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా కోట్ల సుజాతమ్మ కొనసాగుతోంది. అయితే ఇదే నియోజకవర్గం టీడీపీ మాజీ ఇన్‌ ఛార్జీలుగా కొనసాగిన వైకుంఠం మల్లికార్జునచౌదరి, వైకుంఠం శివప్రసాదు, వీరభద్రగౌడు మూడు గ్రూపులుగా విడిపోయారు.

వీరు విడివిడిగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి నాయకులతో పాటు తాను కూడా అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ఐదు పర్యాయాలు ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు నాయకుల అలసత్వం, వర్గవిభేదాలతో ఓటమిపాలయ్యారు. ప్రధానంగా టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం తాను జెండా మోసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడి పరిస్థితులను పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. నియోజకవర్గంలో ఏ టీడీపీ నాయకుల వద్దకు వెళ్ళినా నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అందువల్ల పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నా.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement