కొనుగోళ్లలో అధికారుల కృషి అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో అధికారుల కృషి అభినందనీయం

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తిచేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.50కోట్ల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యంతో చేసిన ఏడు రకాల పిండివంటల కిట్లను గురువారం సంబంధిత అధికారులకు అందించారు.

ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో గురువారం కలెక్టర్‌ కె.హరిత ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను గురువారం ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమలో సూపరింటెండెంట్‌ అవినాష్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement