కాగజ్నగర్టౌన్: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వే సమర్థవంతంగా చేపట్టాలని ము న్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. ము న్సిపల్ కార్యాలయంలో బుధవారం బూత్ లె వల్ అధికారులు, ఏజెంట్లతో సమావేశమయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జా బితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ని లుస్తుందని, అర్హుల పేర్ల నమోదు, అనర్హుల తొలగింపు ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో పొరపాట్లకు తావులేకుండా పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓట ర్లుగా నమోదు చేయడంతోపాటు చిరునామా మారిన వారిని, మరణించిన వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.


