ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివా రం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 353 మంది విద్యార్థులకు 316(89.5 శాతం) మంది హాజరు కాగా, 37 మంది గైర్హాజరయ్యారు. రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కాగజ్నగర్ మండలానికి ఓ విద్యార్థినిని అధికారులు అనుమతించకపోవడంతో తిరిగివెళ్లిపోయింది. కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీఈవో సచ్చిదానందచారి పరీక్ష తీరును పర్యవేక్షించారు. డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహం, ప్రిన్సిపాల్ రహీం తదితరులు పాల్గొన్నారు.


