భగవద్గీతపై ప్రచారం
దండేపల్లి: మండలంలోని నంబాల గ్రామంలో త్రై త సిద్ధాంతం–ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక లక్సెట్టిపేట, కొడిమ్యాల కమిటీ సభ్యులు ఆది వారం త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ గ్రంథా లపై ప్రచారం నిర్వహించారు. మహాశివరాత్రి పండుగ విశిష్టతను ప్రజలకు వివరించారు. శివలింగంపై ఉన్న మూడు విభూతి రేఖలు జీవాత్మ, పరమాత్మలకు గుర్తు అని తెలియజేశారు. కమిటీ సభ్యులు రాజు, రవి, సునీత, మహేశ్, రవళి, రస్మిత, శివ, సాహిత్, రావణ్, అద్వితీయశ్రీ, నాగిరెడ్డి, నాగమణి, వేణుగోపాల్, ఆదిత్య తదితరులున్నారు.


