
సర్కారు బడుల్లో సర్వే
పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులు తెలియజేసేందుకు రూపొందించిన యూడైస్ ప్లస్(డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)లో తరచూ తప్పులు దొర్లుతున్నాయి. ఆన్లైన్లో ఉండే వివరాలకు పాఠశాలల్లో రికార్డులకు సరిపోలడం లేదు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు.. మరుగుదొడ్లు ఉన్నాయా.. తరగతి గదులెన్నీ.. తదితర విషయాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలించేందుకు తొలిసారి థర్ట్ పార్టీతో సర్వే చేపట్టనుంది. మంగళవారం నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో వివరాల సేకరణ కొనసాగనుంది.