
ఐక్య ఉద్యమాలకు చిరునామా టీఎస్యూటీఎఫ్
కాగజ్నగర్రూరల్: ఐక్య ఉద్యమాలకు చిరునా మాగా టీఎస్ యూటీఎఫ్ నిలిచిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు వి.శాంతికుమారి అ న్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫె డరేషన్ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో టీఎస్ యూటీఎఫ్ పనిచేస్తుందన్నారు. హక్కులు, బాధ్యతలు ఉద్యమ నేత్రాలుగా, ప్రాంతాలు, యాజమాన్యాలు, క్యాడర్లు, మతా లు, కులాల అంతరాలను అధిగమించి ఉపాధ్యాయులందరికీ ఒకే సంఘం అనే చారిత్రక ఆవశ్యకతతో సంఘం ఆవిర్భవించిందని తెలి పారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఎం.రాజకమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా యూనియన్ పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రీతి, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు వసాకె సాయికుమార్, నాయకులు బాజీఖాన్, శిరీష, సురేశ్, జహీర్, విజయ్, రాజశేఖర్, ప్రవళిక, రష్మిక, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.