
వేడెక్కుతున్న ఓసీపీలు
● 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
● ఉపశమన చర్యలు చేపట్టిన కంపెనీ
● పని వేళలు మార్చాలని డిమాండ్
శ్రీరాంపూర్: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఓపెన్ కాస్టు ప్రాజెక్టు (ఓసీపీ)లు వేడెక్కుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగడంతో ఓసీపీలు, ఇతర సర్ఫేస్ డిపార్టుమెంట్లలో పని చేస్తున్న కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోల్చి తే సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఓసీపీ ప్రాంతాల్లో బొగ్గు అంతా ఎండలో ఉండడంతో దాని ప్రభావంతో ఉష్ణోగ్రత రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవు తోంది. ఎండ వేడితో కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా, మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లి రీజి యన్లో ఉన్న ఓసీపీల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధి కై రిగూడ, మందమర్రి ఏరియా పరిధి కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీ పీ, శ్రీరాంపూర్ ఏరియా పరిధి ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీలున్నాయి. శ్రీరాంపూర్ ఓసీపీలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. శనివారం 39డిగ్రీలు నమోదు కాగా, మందమర్రిలో 38 డిగ్రీలు, బెల్లంపల్లిలో 39 డిగ్రీలు నమోదయ్యా యి. వీటిలో ఎండ తీవ్రతను కార్మికులు తట్టుకోవడానికి కంపెనీ ఉపశమన చర్యలు చేపట్టింది.
చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఎండలు ముదరడంతో అన్ని ఓసీపీల్లోని క్వారీల్లో చలువ పందిళ్లు వేశారు. విధులకు వెళ్లే సమయంలో కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. కార్యాలయాల వద్ద వాటర్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. కార్మికులు పని స్థలాల వద్దకు చల్లని నీరు తీసుకెళ్లడం కోసం ప్రత్యేకంగా కూల్ బాటిళ్లు అందజేశారు. ఓసీపీల్లో ఓబీ పనులు, సీహెచ్పీల వద్ద బెల్ట్ క్లీనింగ్, షెల్పికింగ్, రోడ్లు ఊ డ్చే ఇతర కార్మికులకూ కాంట్రాక్టర్లు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. కాలనీల్లో సివిక్ పనులు చేసే కాంట్రాక్టు కార్మికులకు మాత్రం ఇవ్వడం లే దు. వారికీ వడదెబ్బ తగలకుండా ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆర్కేపీ ఓసీపీ మూసివేత కార్యక్రమం సాగుతుండగా అక్కడ వే సవి ఉపశమనచర్యలు నామమాత్రంగా చేపట్టింది.
వాహనాల్లో ఏసీ
క్వారీల్లో నడిచే వాహనాలన్నీ ఏసీ కండీషన్లో ఉంచాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు షవల్స్, డంపర్లు, డోజర్లు ఇతర అన్ని భారీ వాహనాల్లో ఏసీలు చెడిపోతే మరమ్మతు చేయిస్తున్నారు.
పని వేళలు మార్చాలి
ఎండ తీవ్రత దృష్ట్యా ఓసీపీల్లో పని వేళలు మార్చాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం షిఫ్ట్ 7నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఉండగా, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చాలని కోరుతున్నా రు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దీన్ని సాయంత్రం 4నుంచి 11 గంటల వరకు మార్చాలని అంటున్నారు. గతంలో వేసవి వచ్చిందంటే ఈ కొత్త పనివేళలు అమలు చేసేవారు. మూడేళ్ల నుంచి డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఈ సారైనా వేళలు మార్చాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి బాజీసైదా డిమాండ్ చేశారు.