రఘునాథపాలెం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలంలో గిరిజన గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్ల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మంగళవారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రతిపాదనలు అందజేశారు. మండలంలోని 37 జీపీలకు గాను 28 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పరిధిలో ఉండగా, సరైన వరద కాల్వలు, డ్రెయినేజీలు లేక పారిశుద్ధ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేసినందున రూ.110 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
కేంద్రమంత్రి చౌహాన్కు
మంత్రి తుమ్మల వినతి


