టవర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

టవర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం

Jun 16 2025 6:56 AM | Updated on Jun 16 2025 6:56 AM

టవర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం

టవర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం

హొసపేటె: పొలంలో బలవంతంగా కేపీటీసీఎల్‌ టవర్‌ ఏర్పాటు చేస్తున్నారని రైతు పురుగుల మందు తాగాడు. ఈఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా మచ్చి హళ్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కేపీటీసీఎల్‌ సంస్థ 220 కేవీ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పనులను కాంట్రాక్టు ఇచ్చింది. అందులో భాగంగా పొలంలో లైట్‌ స్తంభం ఏర్పాటు చేస్తుండగా తన పొలంలో టవర్లు వద్దని వీజీ నాయక్‌ అనే రైతు కాంట్రాక్టర్లను, అధికారులను కోరాడు. దీంతో వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్‌ హరపనహళ్లి పోలీసులను పిలిపించి పనులు చేపట్టారు. దీంతో వీజీనాయక్‌ పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రైతులు అతన్ని హుటాహుటిన దావణెగెర ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement