సమాజ సేవకునికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

సమాజ సేవకునికి సత్కారం

Jun 17 2025 5:26 AM | Updated on Jun 17 2025 5:26 AM

సమాజ

సమాజ సేవకునికి సత్కారం

రాయచూరు రూరల్‌: ఉత్తమ పౌరుడిగా మెలుగుతూ మారుతి అందిస్తున్న సమాజ సేవకు వయస్సు ఆటంకం కాదని సమాజ సేవకుడు ఉదయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లాలోని సిరవారలో మారుతి బడిగేరకు జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పుట్టిన గ్రామానికి మారుతి చేస్తున్న సేవలు మరువరానివన్నారు. ప్రజలను పలకరించి వారి సమస్యలపై స్పందించి న్యాయం చేయడంలో ముందుంటారన్నారు. కార్యక్రమంలో అస్లాంపాషా, రేణుక, బ్రిజేష్‌ పాటిల్‌, ఉమాపతి, శ్రీనివాస్‌, ినింబయ్య, శివరాజ్‌, పరశఽురామ, అబ్రహం, అమరేగౌడ, శాంత, సంతోషిలున్నారు.

ఎన్‌ఆర్‌బీసీ పనుల్లో

నాణ్యత డొల్ల

రాయచూరు రూరల్‌: నారాయణపుర కుడిగట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) మరమ్మతు పనుల్లో నాణ్యత లేకుండా నాసిరకంగా పనులు చేపడుతున్నారు. లింగసూగూరు, దేవదుర్గ తాలూకాల్లో ఎన్‌ఆర్‌బీసీ పనుల్లో పూర్తి స్థాయిలో నాణ్యత కొరవడింది. కాలువ మరమ్మతు పనుల్లో కింది భాగంలో నామమాత్రంగా కాంట్రాక్టర్లు పనులు చేసి చేతులు దులుపుకున్నారు. గురువారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేతలు బసవరాజ్‌ పనులు జరుగుతున్న కాలువలను పరిశీలించారు. లింగసూగూరులో 4 కి.మీ. పనులకు రూ.2.75 కోట్లు, దేవదుర్గలో 4 కి.మీ పనులకు రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. ఈనేపఽథ్యంలో రైతులు కాలువ కింది భాగంలో చేతులతో పెకలించగానే పెచ్చు ఊడి పైకి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ ఇంజినీర్లను పిలిచి పనుల తీరుపై ఆరా తీశారు. నాసిరకంగా పనులు చేపట్టి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకొని తప్పించు కోవడం తగదన్నారు. అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

అభివృద్ధి పనుల

ప్రగతిపై సమీక్ష

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలో రైలు మార్గ నిర్మాణాలపై జరిగిన సమావేశంలో పెండింగ్‌లో ఉన్న కల్మల–సింధనూరు రైలు మార్గ నిర్మాణంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్‌ జార్కిహోళి అధ్యక్షతన చర్చ జరిపారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. కల్మల– సింధనూరు చతుష్పథ రహదారి పనులు మందకొడిగా సాగుతున్న అంశంపై సమీక్షించారు. 77 కి.మీ.లకు రూ.1700 కోట్లు వ్యయం చేస్తున్నారన్నారు. సమావేశంలో మంత్రి బోసురాజు, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌, శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, హంపయ్య నాయక్‌, హంపనగౌడ బాదర్లి, బసనగౌడ, కరెమ్మ నాయక్‌, ఎమ్మెల్సీ వసంత కుమార్‌, జిల్లాధికారి నితీష్‌, జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారకాం పాండేలున్నారు.

కాంగ్రెస్‌ కచేరీలుగా

పోలీస్‌ స్టేషన్లు

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా పోలీస్‌ స్టేషన్లు మారాయని యాదగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవరాజ్‌ ఆరోపించారు. సోమవారం నగరంలోని సుభాష్‌ చంద్ర బోస్‌ సర్కిల్‌ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్‌ను కీలుబొమ్మగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేశారన్నారు. పాకిస్తాన్‌, నాసిర్‌ సాబ్‌ జిందాబాద్‌ అన్న వారిని సమర్ధించడాన్ని తప్పుబట్టారు. చిన్నస్వామి క్రీడా మైదానంలో ఆర్‌సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అసువులు బాసారని గుర్తు చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించకుండా నిరంకుశ పద్ధతిలో పాలన సాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహేష్‌గౌడ, బసవరాజ్‌, నాగరత్నలున్నారు.

సమాజ సేవకునికి సత్కారం 1
1/3

సమాజ సేవకునికి సత్కారం

సమాజ సేవకునికి సత్కారం 2
2/3

సమాజ సేవకునికి సత్కారం

సమాజ సేవకునికి సత్కారం 3
3/3

సమాజ సేవకునికి సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement