
సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించాలి
రాయచూరు రూరల్ : ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించాలని రాష్ట్ర చిన్నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పిలుపునిచ్చారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందరంలో లో మడివాళ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభాపురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాడివాళ సముదాయం విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. తమ పిల్లలను ఉత్తమ విద్యావంతులను చేయాలన్నారు. అనంతరం టెన్త్, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యలు, ఎంపీ కుమారనాయక్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, రవీంద్ర జాలదార్, శాంతప్ప, శివమూర్తి, చంద్రశేఖర్, జయన్న, అమరేగౌడ, మంజుల పాల్గొన్నారు.