
నిర్బంధ విద్య ప్రతి బిడ్డ హక్కు
హొసపేటె: ఉచిత, నిర్బంధ విద్య ప్రతి బిడ్డ హక్కు, దానిని ప్రతి బిడ్డకు అందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అని హొసపేటె తాలూకా విద్యా శాఖ అధికారి శేఖరప్ప హొరపేటె అన్నారు. నగరంలోని చిత్తవాడిగిలోని ప్రభుత్వ పీయూ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం అన్నారు. ప్రభుత్వాలు మాత్రమే బాల కార్మికులను పూర్తిగా నిర్మూలించలేవు. ప్రజలు, సంఘ సంస్థల సహకారం చాలా అవసరమని ఆయన అన్నారు. పౌర సమాజం నుంచి బాల కార్మిక వ్యవస్థను, బాల కార్మికులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్మిక అధికారి సూర్యప్ప దొంబరమత్తూరు, న్యాయవాది శ్వేతాంబరి, ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజ్ హవల్దార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీకాంత్, ప్రముఖులు రుద్రప్ప అక్కి, లింగరాజ్, ఈశ్వర్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పైవంతెన నిర్మాణానికి
ఈద్గా కాంపౌండ్ తొలగింపు
హుబ్లీ: నగరంలోని నిర్మాణ దశలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఈద్గా మైదానం ఆవరణ గోడలో చాలా భాగాన్ని తొలగిస్తున్నారు. స్వాధీన ప్రక్రియ పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మైదానం మధ్య భాగంలోని ఈద్గా కట్టడం రక్షణకు అడ్డు గోడ సమీపంలో సుమారు 10–20 మీటర్ల షెడ్డు మాదిరిగా సీట్లను అమర్చారు. చెన్నమ్మ సర్కిల్ నుంచి కోర్టు సర్కిల్కు వెళ్లే మార్గంలో ఇనుప కడ్డీలతో గోడను గ్యాస్ కట్టర్తో కట్ చేసి తొలగించారు. జాతీయ రహదారి ప్రాధికార, సదరు నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన అధికారులు పోలీసు భద్రతతో ఈ పనులను ప్రారంభించారు. ప్రతిష్టమైన పోలీసు భద్రత కొనసాగుతోంది. సదరు గోడ తొలగింపునకు అనుమతి, అలాగే భద్రత ఇవ్వాలని సదరు ప్రాధికార అధికారులు కార్పొరేషన్కు, పోలీసు శాఖకు 2024 జూలై 23న లేఖ రాసి తెలియజేసిన సంగతి తెలిసిందే. పథకం ప్రకారం చెన్నమ్మ సర్కిల్ నుంచి కోర్టు సర్కిల్ వైపు, అలాగే చెన్నమ్మ సర్కిల్ నుంచి సంగొళ్లి రాయణ్ణ వరకు వెళ్లే ఈద్గా మైదానం చుట్టుపక్కల భాగం తొలగించనున్నారు. ఫ్లై ఓవర్కు కామతోటలు ఎదురుగా భారీగా పిల్లర్లు, సంగొళ్లి రాయణ్ణ సర్కిల్లో ఐ మార్ట్ స్తంభం వద్ద ఒక పిల్లరు నిర్మాణం కానుంది. అలాగే ఈ పనులకు ఉప నగర పోలీస్టేషన్ కట్టడం 20 శాతం మేర తొలగించనున్నారు.
అంబేడ్కర్ సేవలు విశిష్టం
రాయచూరు రూరల్: అంబేడ్కర్ ఆర్థిక శాస్త్రవేత్త అని, సాంఘీక న్యాయంతో పాటు దేశానికి ఆర్థిక రంగంలో విశిష్ట సేవలు అందించారని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతీయ కరెన్సీ సమస్యలు– పరిష్కారంపై చర్చాగోష్టిని ప్రారంభించి మాట్లాడారు. ఈ విషయంలో విద్యార్థులకు ఆర్థిక రంగం, రూపాయి విలువ గురించి వివరించాలన్నారు. దేశఽ ఆర్థిక పరిస్థితి బలోపేతానికి మత వ్యవస్థ్ద కంటకంగా మారిందని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో లోక్సభ సభ్యుడు కుమార నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణ, కృష్ణంరాజు, ప్రకాష్, కమల్ కుమార్, కృష్ణ, లలిత, ప్రాణేష్, మహంతేష్, శోభ, శివరాజప్ప, సావిత్రిలున్నారు.
ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
క్రిష్ణగిరి: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది. అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు.

నిర్బంధ విద్య ప్రతి బిడ్డ హక్కు