కేకేఆర్‌డీబీకి రూ.5 వేల కోట్ల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌డీబీకి రూ.5 వేల కోట్ల కేటాయింపు

Jun 15 2025 7:24 AM | Updated on Jun 15 2025 7:24 AM

కేకేఆర్‌డీబీకి రూ.5 వేల కోట్ల కేటాయింపు

కేకేఆర్‌డీబీకి రూ.5 వేల కోట్ల కేటాయింపు

రాయచూరు రూరల్‌: కల్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి(కేకేఆర్‌డీబీ)కి సర్కార్‌ రూ.5000 కోట్లు కేటాయించిందని, ఆరు జిల్లాల్లో అభివృద్ధి పనులకు జూలై 15 లోపు శాసన సభ్యుల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. శనివారం యాదగిరిలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి సమావేశం అనంతరం అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి పనులు ఆరు జిల్లాల్లో కుంటుపడ్డాయన్నారు. కేకేఆర్‌డీబీ పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, బీదర్‌ జిల్లాల్లో అభివృద్ధి పనులకు మొత్తం రూ.14,228 కోట్లలో రూ.10,342 కోట్లు వ్యయం కాగా మిగిలిన రూ.2885 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాల భవనాలు, తాగు నీటిి నిర్వహణ, విద్యుత్‌ దీపాల అమరిక, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

క–క అభివృద్ధికి సర్కార్‌ కంకణం

కల్యాణ కర్ణాటక(క–క) అభివృద్ధికి కాంగ్రెస్‌ సర్కార్‌ నిబద్ధతతో పని చేస్తుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ వెల్లడించారు. శనివారం యాదగిరి క్రీడా మైదానంలో జరిగిన ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.440 కోట్లతో ఆరోగ్య ఆవిష్కార పథకానికి శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం అశాశ్వతం, సాధనలు శాశ్వతమన్నారు. కర్ణాటకలో ప్రజలు 140 మంది శాసన సభ్యులను అందించారన్నారు. అందువల్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మంత్రులు శరణ ప్రకాష్‌ పాటిల్‌, దినేష్‌ గుండూరావు, బోసురాజు, శరణ బసప్ప దర్శనాపూర్‌, సుధాకర్‌, రహీంఖాన్‌, ఈశ్వర్‌ ఖండ్రే, హెచ్‌కే పాటిల్‌, ఎంపీలు కుమార నాయక్‌, నాసిర్‌ హుసేన్‌, రాధాకృష్ణ, చెన్నారెడ్డి పాటిల్‌లున్నారు.

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

సిద్ధం చేయండి

అధికారులకు ముఖ్యమంత్రి

సిద్ధరామయ్య సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement