
వైభవంగా కాళికా మాత జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కాళికా మాత జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం విశ్వ కర్మ సమాజం ట్రస్ట్, వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మ వారికి అభిషేకం చేయించారు. అలంకరణలతో కాళికా దేవి ఆలయంలో మాతకు విశేష పూజలు జరిపి అమ్మవారి విగ్రహానికి పుష్ప వృష్టి, ప్రత్యేక అలంకార సేవలు చేసి పల్లకీ సేవల్లో ఊరేగించారు. దేవికి పూలు, పండ్లు, ధవస, ధాన్యాలతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఈశ్వర్, నారాయణ, జయంతాచారి, నాగరాజ్, రవీంద్ర, లక్ష్మిపతి, హరినాథ్, మల్లేష్, మౌనేష్, ఆనంద్, శ్రీకాంత్, గిరిబాబు, వినోద్, ఆకాష్, హరిహరన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వైభవంగా కాళికా మాత జయంతి