కరీంనగర్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూపుకి చెందిన భారతి సిమెంట్ ఎదుగుతోందని సంస్థ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ మైత్రి హోటల్లో సివిల్ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ వికాట్ గ్రూప్ కంపెనీస్ ప్రపంచంలోని 12 దేశాల్లో విస్తరించి ఉన్నయాని తెలిపారు. మార్కెట్లో లభించే ఇత ర సిమెంట్తో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలావేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. టెక్నికల్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ, అల్ట్రాఫాస్ట్ సిమెంట్ ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రోడ్లకు సరైన ఎంపికన్నారు. మార్కెటింగ్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ సర్వీస్ చాలా వేగంగా ఉంటుందన్నారు. ఈసమావేశంలో మార్కెటింగ్ ఆఫీసర్ అభిలాష్, ఇంజినీర్స్ పాల్గొన్నారు.
మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి


