మక్కల కొనుగోళ్లకు రైతులను దూరం చేయాలనే నెపంతోనే ఎకరాకు కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వాస్తవంగా ఎకరాకు 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మిగిలిన 15 క్వింటాళ్లను ఎక్కడ అమ్ముకునుడో అర్థం కావడం లేదు.
– బందెల మల్లయ్య, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు, చల్గల్
జిల్లాలో మక్కల కొనుగోలుకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. త్వరితగతిని రైతుల నుంచి మక్కలు సేకరిస్తాం. ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే కొనాలనే నిబంధనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతాం.
– ఎండీ.హబీబ్


