కరీంనగర్ టౌన్:కుల, లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి.. తన బోధనలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన మహనీయుడు, గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో బసవేశ్వరుడి జ యంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ సహా ఇతర అధికారులు పూలమాలలు వేసి ని వాళి అర్పించారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా బీసీ అ భివృద్ధి అధికారి అనిల్ ప్రకాశ్, వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు న్యాలమడుగు శంకరయ్య, 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి, లుక్క రాజేశం, గాజుల స్వప్న పాల్గొన్నారు.


